బ్రేకింగ్ : కీలకసమయంలో టీడీపీకి ఎంపీ జేసీ షాక్.. సంచలన ప్రకటన..

nanireddy
Updated on: 24 Dec 2018 2:01 PM IST
బ్రేకింగ్ : కీలకసమయంలో టీడీపీకి ఎంపీ జేసీ షాక్.. సంచలన ప్రకటన..
X

కీలకసమయంలో టీడీపీకి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి షాకిచ్చారు ఎంపీ. సుజనాచౌదరి వైఖరితో మనస్తాపం చెందానని తాను పార్లమెంట్‌కు హాజరయ్యేది లేదంటూ సంచలన ప్రకటన చేశారు. విప్‌ జారీ చేసినా లోక్‌సభకు వెళ్లబోనంటూ తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ అంతర్మథనంలో పడింది. జేసీని బుజ్జగించడంకోసం సీనియర్ మంత్రులు, నేతలు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో రాజకీయాలు బాగా లేవన్న జేసీ.. టీడీపీ విప్‌ జారీ చేసినంత మాత్రాన ఏమీ కాదన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు సమర్థులైన నాయకులు చాలామందే ఉన్నారన్నారు.

nanireddy

nanireddy

Next Story