నేను గవర్నర్‌గా వెళ్లను.. ఎంపీగా మళ్లీ పోటీ చేస్తా

నేను గవర్నర్‌గా వెళ్లను.. ఎంపీగా మళ్లీ పోటీ చేస్తా
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అత్యధిక సాయం చేసిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన ఓ...

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అత్యధిక సాయం చేసిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో మిషన్‌ భగీరథకు రూ.3,900కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ. 677 కోట్లు ఇచ్చిందని.. ప్రాజెక్టుల వేగవంతానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. తాను గవర్నర్‌గా వెళ్లబోనని, ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేస్తూ 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని తెలిపారు. తెలంగాణకు 24గంటల విద్యుత్‌ ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్‌ ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories