టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై ఈసీకి రేవంత్‌ ఫిర్యాదు

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై ఈసీకి రేవంత్‌ ఫిర్యాదు
x
Highlights

తొమ్మిది మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆప్‌ ఎమ్మెల్యేల తరహాలో...

తొమ్మిది మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆప్‌ ఎమ్మెల్యేల తరహాలో లాభదాయక పదువుల్లో ఉన్న టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించారని, మరో ముగ్గురు లాభదాయక పదవుల్లో ఉన్నారని లేఖలో ఆరోపించారు. వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావులను సీఎం కార్యాలయంలో సెక్రటరీలుగా నియమించారని శ్రీనివాస్ గౌడ్, సతీష్ కుమార్‌లను డిప్యూటీ సీఎం కార్యాలయాల్లో సెక్రటరీలుగా నియమించారని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధమైన పదవుల్లో ఉన్నారంటూ గతంలో హైకోర్టు కూడా వీరి నియామకాలను రద్దు చేసిందని లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories