ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం

nanireddy
Updated on: 24 Dec 2018 3:24 PM IST
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం
X

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి కనకదుర్గ అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఈవో కోటేశ్వరమ్మ దంపతులు తొలిపూజ నిర్వహించగా, రెండో పూజను పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు దంపతులు నిర్వహించారు. తొలిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు(బుధవారం) 11 గంటల వరకు భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం కల్పించనున్నారు.

nanireddy

nanireddy

Next Story