పార్టీ ఓటమి చెందినందుకు బాధ లేదు..!

nanireddy
Updated on: 24 Dec 2018 12:24 PM IST
పార్టీ ఓటమి చెందినందుకు బాధ లేదు..!
X

గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినదుకు నిరాశ లేదన్న రాహుల్, రెండు రాష్ట్రాల్లో పార్టీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు.. గుజరాత్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంపై పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో మీడియాతో మాట్లాడిన రాహుల్ రాబోయే కాలంలో పార్టీ పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.. అంతేకాదు గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందిందని అన్నారు.. కొన్ని చోట్ల రిగ్గింగుకు పాల్పడి , ఈవీఎంలను టాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారన్నారు..

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్‌లో బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు ఫలితాలను బట్టి అర్థమౌతోంది. దీంతో ఆరోసారి బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ ఓటింగ్ శాతం ఇక్కడ పెరిగినట్లు స్పష్టమౌతోంది. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా బీజేపీ ఆధిక్యం కనబరిచి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తుంది..

nanireddy

nanireddy

Next Story