జగన్ ను కలిసిన మరో సినీ ప్రముఖ వ్యక్తి..
వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు, కార్యకర్తలే కాకుండా సినీ ప్రముఖల నుంచి మద్దతు లభిస్తోంది. గతంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి, విలక్షణ నటుడు పృథ్వి పాదయాత్రలో జగన్ కలిసి మద్దతు పలికారు తాజగా జాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు వైఎస్ జగన్ను కలిశారు. సోమవారం, మండపేట నియోజకవర్గం సోమేశ్వరంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జననేతను కలిసి తమ మద్దతును తెలియచేశారు. ఈ సందర్భంగా చోటా కే నాయుడు మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు.ప్రజాసంకల్పయాత్రకు తూర్పు గోదావరి జిల్లా ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. జగన్ తమ ఊరు పసలపూడి రావడం తమకు ఆనందాన్ని ఇచిందని అన్నారు.
Next Story




