వరంగల్ ఐటీ కార్యాలయంలో సీబీఐ దాడులు

వరంగల్ ఐటీ కార్యాలయంలో సీబీఐ దాడులు
x
Highlights

వరంగల్‌లోని ఐటీ కార్యాలయంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐటీ శాఖ సీనియర్ అధికారి శశికుమార్ 20వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా...

వరంగల్‌లోని ఐటీ కార్యాలయంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐటీ శాఖ సీనియర్ అధికారి శశికుమార్ 20వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. వరంగల్ రూరల్ జిల్లాలోని ఉప్పరపల్లికి చెందిన ఏకాంబరం ఆదాయానికి మించి లావాదేవీలు చూపడంతో ఐటీశాఖ నుంచి గతేడాది నోటీసులు ఇచ్చారు. ఆయన లావాదేవీలను సీఏ ద్వారా అందించిన ఐటీ ఉన్నతాధికారి మణిష్ కమల్ 50వేలు లంచం డిమాండ్ చేశారు. దీనికి మధ్యవర్తిగా శశికుమార్ వ్యవహరించాడు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని ఏకాంబరం సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్‌ ప్రకారం సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా శశికుమార్‌ను పట్టుకుని, అతన్ని హైదరాబాద్ తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories