జగన్ పై దాడి : కోర్టును ఆశ్రయిస్తా : మంత్రి పితాని

nanireddy
Updated on: 24 Dec 2018 3:41 PM IST
జగన్ పై దాడి : కోర్టును ఆశ్రయిస్తా : మంత్రి పితాని
X

జగన్ అభిమానినంటూ విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై కత్తి దాడికి పాల్పడ్డాడు శ్రీనివాస్ అనే వ్యక్తి అతను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా.. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జగన్ పై దాడిని రాజకీయం చేయవద్దని అన్నారు మంత్రి పితాని సత్యనారాయణ. జగన్‌పై జరిగిన దాడిని రాజకీయం చేయడం బాధాకరమని. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని... అందుకు సీఎం చంద్రబాబు, డీజీపీలపై ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన జగన్ వాంగ్మూలం కోసం కోర్టును ఆశ్రయిస్తానన్నారు. దోషులను వదిలే ప్రసక్తే లేదన్న ఆయన విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే దానికి జగన్ సహకరించాలన్నారు.

nanireddy

nanireddy

Next Story