బ్రేకింగ్ : పట్టాలు తప్పిన రైలు : ఆరుగురు మృతి

బ్రేకింగ్ : పట్టాలు తప్పిన రైలు : ఆరుగురు మృతి
x
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందగా,...

ఉత్తరప్రదేశ్‌లో ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందగా, దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. లక్నోనుంచి అలహాబాద్‌కు వెడుతుండగా హరచాంద్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కాగా ప్రమాదానికి కారణం పట్టాలు తప్పడమే కాకుండా ఇంకా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories