ఉద్యోగులకు, పెన్షనర్లకూ కేంద్రం తీపి కబురు

ఉద్యోగులకు, పెన్షనర్లకూ కేంద్రం తీపి కబురు
x
Highlights

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏను 4శాతం నుంచి 5శాతానికి పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు...

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏను 4శాతం నుంచి 5శాతానికి పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు వల్ల 50లక్షల మంది ఉద్యోగులు, 61లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా పెంచిన డీఏ శాతం జులై 1 నుంచి వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుకగా డీఏ పెంపును ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories