Kurnool-Srisailam updates: శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం

-కర్నూలు జిల్లా

-శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం

-కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో నెల రోజుల జాప్యం అనంతరం ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడడంతో మళ్లీ మూడోసారి విచారిస్తున్న ఏసిబీ బృందం

-శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అతిథి గృహం వద్ద దేవస్థానంకి సంబంధించిన అన్ని రికార్డులను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

-ఇదివరకు 2017 నుండి ఇప్పటివరకు ఆన్లైన్ టికెట్ల రికార్డులను మాత్రమే తనిఖీ చేయగా ప్రస్తుతం తాజాగా 2016–17 సంవత్సరానికి సంబంధించి మ్యాన్యువల్ టికెట్ల రికార్డులను పరిశీలించి అవినీతి జరిగితే వారిని అరెస్టు చేసే అవకాశం

-ఈ కుంభకోణంలో ఇప్పటికే 33 మంది అరెస్టు చేసిన అధికారులు

-ఈ కుంభకోనానికి సంబంధించి ఇప్పటికే IPC 406,420,409 మరియు ఐ టి యాక్ట్ 65,66 సెక్షన్లు క్రింద కేసు నమోదు

-కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అందరికీ బెయిలు మంజూరు చేసిన కోర్టు

-విచారణలో భాగంగా వివిధ విభాగాలకు సంబంధించి వేరువేరుగా పిలిపించి గోప్యంగా విచారిస్తున్న అధికారులు

-కుంభకోణంలో అరెస్టయిన 33 మందిని మరోసారి విచారణ చేయనున్నట్లు సమాచారం

-శ్రీశైలం కుంభకోణంలో 2 కోట్ల 56 లక్షల కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే నిర్ధారించిన ఏసిపి బృందం వాటిని రికవరీ చేసే దిశగా రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి రికవరీ చేసే దిశగా కూడా ప్రయత్నాలు ముమ్మరం

Show Full Article
Print Article
Next Story
More Stories