రేపు అమూల్‌తో సీఎం అవగాహన ఒప్పందం

అమరావతి: అమూల్‌ తో అవగాహన ఒప్పందం నేపధ్యంలో క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

- అవగాహన ఒప్పందంలోని అంశాలను సీఎం వైయస్‌.జగన్‌కు వివరించిన అధికారులు

- రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి రంగంలో కీలకపాత్ర పోషించనుందన్న అధికారులు

- రాష్ట్రంలో మహిళా పాడి రైతులను ఆర్ధికంగా, సామాజికంగా పైకి తీసుకురావడంలో ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి.

- మహిళల సాధికారతకూ తోడ్పాటునందిస్తుందని వెల్లడి

- మొత్తంగా డెయిరీ కార్యకలాపాల్లో కీలక అడుగు ముందుకు పడనుందన్న సీఎం

- పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకి, నాణ్యమైన పాలఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్న సీఎం

- ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్‌ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్రంలో పాడిపరిశ్రమ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన సీఎం

- వైయస్సార్‌ చేయూత, ఆసరా పథకం కింద మహిళలకు ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం.

- మహిళలు మరింత స్వయం సమృద్ధి సాధించేదిశగా పాడిపరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రొత్సహించాలి

- ఆ పరిశ్రమల్లో వారికున్న అవకాశాలను పరిశీలించి మహిళలను ముందుకు నడిపించాలన్న సీఎం.

Show Full Article
Print Article
Next Story
More Stories