-ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శలలో అర్థం లేదు: హొం మంత్రి మహమూద్ అలీ

- నూతన సచివాలయం నిర్మాణం లో భాగంగా అక్కడ నూతన మసీదును, మందిరంలను భారీస్థాయిలో నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత కూడా ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలు చేస్తూన్నారు.

-నూతన సచివాలయం భవనం నిర్మించిన తరువాత మసీదులో, మందిరంలో ప్రార్థనలు చేసిన తర్వాతనే నూతన సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు.

- రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఏ అంశం దొరకనందునే మసీదు ,మందిరం విషయంలో వారు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు

-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక , మున్ముందు ఇదేవిధంగా కొనసాగితే తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు

-ముఖ్యమంత్రి సెక్యులర్ నాయకుడని అన్ని మతాల, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు

- ఇప్పటికే యాదగిరిగుట్ట లో చరిత్రలో లిఖించదగిన దేవాలయాన్ని పునర్నిర్మి స్తున్న విషయం ప్రజలకు తెలుసుకున్నారు

-అత్యంత భారీ స్థాయిలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి సచివాలయంలో మసీదు ,మందిరం నిర్మాణం చేయడం పెద్ద సమస్య కాదు

ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలనాయకులు గందరగోళం సృష్టించ వద్దని హితవు

-తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై విశ్వాసం ఉంది.

- ప్రతిపక్ష పార్టీల నాయకులు కల్లబొల్లి మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరు

Show Full Article
Print Article
Next Story
More Stories