బెల్టుషాపుల మాకొద్దు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కిన మహిళలు

మైలవరం: నియోజకవర్గంలోని మైలవరం మండలం అనంతవరం బెల్ట్ షాపులు మాకొద్దు బాబోయ్ అంటూ అనంతవరం గ్రామంలో మహిళలు రోడ్డెక్కారు.

- ఆంద్ర బోర్డర్ లో రోజురోజుకూ విపరీతంగా పుట్టుకొస్తున్న మద్యం బెల్ట్ షాపులు తీసివేయాలని అనంతవరం మరియు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామస్తులు గళమెత్తారు.

- కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల నుండి తమ గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మధ్యం సేవించడానికి వచ్చి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న ముందు బాబుల ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని వాపోతున్నారు.

- మహిళలకు రక్షణ లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.

- కరోనా భయంతో కకావికలమవుతుంటే ఎక్కడెక్కడి నుండో వస్తున్న మందుబాబులను బెల్ట్ షాపు నిర్వాహకులు కూర్చోబెట్టి తాగిస్తూ తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారన్నారు.

- బోర్డర్ లో నివాసాలుంటున్న తమకు ఇరు నియోజకవర్గ శాసనసభ్యులు న్యాయం చేయాలని కోరుతున్నారు.

- ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని ఉద్ఘాటించారు.




Show Full Article
Print Article
Next Story
More Stories