త్రాగునీటి సమస్య తీర్చాలంటూ డౌనూరు పంచాయతీలో రోడ్డెక్కిన గ్రామస్తులు

- డౌనూరు పంచాయతీలోని రెల్లలపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ,వాటర్ అందుబాటులోకి రావడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

- ఈ మేరకు గ్రామస్థులంతా వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చి త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

- పంచాయతీలోని పంచాయితీ కార్యదర్శి లేకపోవడంతో మూల పేట కు చెందిన పంచాయతీ కార్యదర్శిని ఇన్చార్జిగా వేశారని సమస్యను ఆమె దృష్టికి కూడా తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు.

- వాటర్ ట్యాంక్ లోని త్రాగునీరు అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.

- ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి గారికి గాని, సచివాలయ సిబ్బందికి గాని చెప్పినా సమస్యను పరిష్కరించడం లేదంటూ తెలిపారు.

- ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య ఒకటే కాదని,ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి అనుకుంటున్నట్లు సురేష్ పట్నాయక్ మరియు గ్రామస్తులు తెలిపారు.  




Show Full Article
Print Article
Next Story
More Stories