
19వ విడత పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయి?
PM Kisan: కేంద్ర ప్రభుత్వం త్వరలో 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ యోజనను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ. 6 వేల ఆర్థిక సహాయం లభిస్తుంది.
PM Kisan: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం 19వ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ. 6 వేల ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ ఆర్థిక సహాయం మూడు విడతలుగా లభిస్తుంది. ప్రతి విడతలో ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 2,000 నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది. ఇప్పటివరకు దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాలకు 18 విడతలుగా ఆర్థిక సహాయం డిపాజిట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది అక్టోబర్ 5న మహారాష్ట్రలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన 19వ విడత ఎప్పుడు విడుదలవుతుందో.. దానిని సద్వినియోగం చేసుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం.
ప్రధానమంత్రి కిసాన్ యోజన 19వ విడత ఎప్పుడు విడుదల అవుతుంది?
కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. చివరి విడత అక్టోబర్ 2024లో వచ్చింది. దీని ప్రకారం, ఈ పథకం తదుపరి విడత ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనం ఏ రైతులకు లభించదు?
ప్రధానమంత్రి కిసాన్ యోజనను సద్వినియోగం చేసుకోవడానికి ఈ-కెవైసి, భూమి రికార్డులను, అంటే భూమికి నిజమైన యజమాని ఎవరో ధృవీకరించడం ముఖ్యం. ధృవీకరణ చేయని రైతులకు ఈ పథకం ప్రయోజనం లభించదు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి వీలైనంత త్వరగా ఈ-కెవైసి, భూ రికార్డుల ధృవీకరణ చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు నిరంతరం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి, రైతు బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానించడం అవసరం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
* ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ఏటా రూ.6,000 సహాయం అందుతుంది. ఇది వారి వ్యవసాయ సంబంధిత అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడుతుంది.
* తక్కువ భూమి ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
* పీఎం కిసాన్ యోజనలో మధ్యవర్తి లేరు. ఈ పెట్టుబడి సాయం మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. దీనివల్ల అవినీతికి ఆస్కారం తగ్గుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం.
* ఈ పథకంలో రైతుల పేర్లు నమోదు ప్రక్రియ చాలా సులభం. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ చేయవచ్చు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire