దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు అనేక రకాలుగా సేవలు అందిస్తుంది. నెట్ బ్యాంకింగ్, యోనో మొబైల్ బ్యాంకింగ్, ఓడీ, డిజిటల్...
దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు అనేక రకాలుగా సేవలు అందిస్తుంది. నెట్ బ్యాంకింగ్, యోనో మొబైల్ బ్యాంకింగ్, ఓడీ, డిజిటల్ లావాదీవీలు అనేక రకాలుగా సేవలు అందిస్తుంది. అయితే తాజా తన కస్టమర్లకు షాక్ ఇవ్వనుంది. బ్యాంకు ఖాతాదారుల వద్ద ఉన్న పాత డెబిట్ కార్డులు ఇక నుంచి పని చేయవని చెప్పింది. డిసెంబర్ 31లోగా తమ ఖాతాదారులు డెబిట్ కార్డుల ను మార్చుకోవాలని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కార్డులను తిరిగి మార్పు చేసినట్లు తెలిపింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు అరికట్టేందుకు ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈఎంవీ చిప్ కార్డులను ఖాతాదారులు తీసుకోవాలని ఆర్భీఐ ప్రవేశ పెట్టింది. ఇప్పటికీ కూడా కొత్త చిప్ కార్డులు తీసుకోని ఖాతాదారులు వెంటనే దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి మార్చు కోవాలని సూచించింది.
ఈ మేరకు మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్కార్డును మార్చుకోవడానికి దర్గరలోని బ్రాంచ్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ లో తెలిపింది. కొత్త ఈఎంవీ చిప్, పిన్ కార్డును తీసుకోవాలని పేర్కొంది. మ్యాగ్నటిక్ స్ట్రిప్ డిబిట్ కార్డుల వలన ఎన్నో మోసాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు ఈనిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ నెల 31లోగా కార్డులు మార్చుకోవాలని పేర్కొంది.
Apply now to change your Magnetic Stripe Debit Cards to the more secure EMV Chip and PIN based SBI Debit card at your home branch by 31st December, 2019. Safeguard yourself with guaranteed authenticity, greater security for online payments and added security against fraud. pic.twitter.com/t9K3TiGTad
— State Bank of India (@TheOfficialSBI) November 30, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire