Unsuccess Story: ప్రైవేట్ జెట్, బుర్జ్ ఖలీఫాలో రెండు అంతస్తులు.. రూ. 18,000 కోట్లు.. ఒక్క ట్వీట్ అంతా నాశనం చేసింది..!

Dhivi
Updated on: 5 May 2025 4:36 PM IST
Unsuccess Story:  ప్రైవేట్ జెట్, బుర్జ్ ఖలీఫాలో రెండు అంతస్తులు.. రూ. 18,000 కోట్లు.. ఒక్క ట్వీట్ అంతా నాశనం చేసింది..!
X

Private Jet Burj Khalifa two floors 18000 crore bank balance one tweet company sold for 74 rupees

Failed story: బిఆర్ శెట్టి భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో జన్మించారు. ఆయన తన తొలినాళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం 665 రూపాయలతో, అతను మంచి అవకాశాల కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అక్కడ ఫార్మసిస్ట్‌గా పనిచేశాడు. తరువాత తన కృషి, అంకితభావంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు.

బిఆర్ శెట్టి ఎన్ఎంసి హెల్త్ ను స్థాపించారు. ఇది యుఎఇలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ గా మారింది. NMC హెల్త్ ఆరోగ్య సంరక్షణ సేవల్లో కొత్త శిఖరాలను చేరుకుంది. అనేక దేశాలలో తన సేవలను ప్రారంభించింది. దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫాలోని రెండు అంతస్తులను శెట్టి సొంతం చేసుకున్నాడు. దీని విలువ దాదాపు రూ.207 కోట్లు. ఇదే కాదు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, పామ్ జుమైరాలో కూడా ఆస్తులు ఉన్నాయి. శెట్టి కార్ల సేకరణలో రోల్స్ రాయిస్, మేబ్యాక్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇవే కాదు రూ. 34 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌లో 50% వాటాను కూడా కొనుగోలు చేశాడు. ఆయన UAE ఎక్స్ఛేంజ్, Finablr వంటి ఆర్థిక సేవల సంస్థలను కూడా స్థాపించారు. ఇవి రెమిటెన్స్ సేవలలో అగ్రగామిగా నిలిచాయి.

2019లో శెట్టి సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. కార్సన్ బ్లాక్ నేతృత్వంలోని UKకి చెందిన పెట్టుబడి పరిశోధన సంస్థ మడ్డీ వాటర్స్, ఒక ట్వీట్‌లో శెట్టి తన నగదు ప్రవాహాలను ఎక్కువగా చూపించారని.. తన అప్పును తక్కువగా చూపించారని ఆరోపించారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీపై విధించినట్లుగా. ఈ ట్వీట్ తర్వాత, NMC హెల్త్ షేర్లు బాగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ బిలియన్ల రూపాయలు పడిపోయింది. దీని తరువాత, కంపెనీ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తులో, కంపెనీకి 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 29,500 కోట్లు) అప్పు ఉందని, దానిని సరిగ్గా నమోదు చేయలేదని తేలింది.

శెట్టి కంపెనీ భారీ అప్పుల భారంతో కూరుకుపోయింది. ఆర్థిక అస్థిరత కారణంగా అతను తన రూ. 12,478 కోట్ల రూపాయల విలువైన కంపెనీని ఇజ్రాయెల్-యుఎఇ కన్సార్టియంకు కేవలం రూ. 74 కు అమ్మేశాడు. కార్పొరేట్ ప్రపంచంలో ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన పతనాలలో ఒకటి. బిఆర్ శెట్టి మోసం ఆరోపణలను తిరస్కరించారు. చట్టపరమైన చర్య తీసుకున్నారు. ఒక పెద్ద కుట్రకు బలి అయ్యానని ఆయన పేర్కొన్నారు.

Dhivi

Dhivi

Next Story