
Pregnant Women Alert: గర్భిణులకు అలర్ట్.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్కి అప్లై చేశారా..!
Pregnant Women Alert: దేశంలోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ పథకాలను అమలు చేస్తోంది.
Pregnant Women Alert: దేశంలోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ పథకాలను అమలు చేస్తోంది. కోట్లాది మంది ప్రజలు ఈ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గర్భిణులకు రూ.6000 ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ డబ్బు పీఎం మాతృత్వ వందన యోజన పథకం కింద ఇవ్వబడుతోంది. మీరు ఒక మహిళ అయితే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటికే రూ. 3 కోట్ల మందికి పైగా మహిళలు ఈ స్కీం లబ్ధి పొందారు.
పథకం ప్రత్యేకత
>> గర్భిణీల వయస్సు 19 సంవత్సరాలు ఉండాలి.
>> ఈ పథకంలో ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
>> ప్రభుత్వం 3 విడతలుగా రూ.6000 బదిలీ చేస్తుంది.
>> ఈ పథకం 1 జనవరి 2017న ప్రారంభించారు.
>> ఈ పథకంలో వాయిదాల పద్ధతిలో డబ్బు అందుతుంది.
ఈ పథకంలో గర్భిణులకు మొదటి దశలో రూ.1000, రెండో దశలో రూ.2000, మూడో దశలో రూ.2000 ఇస్తారు. బిడ్డ పుట్టినప్పుడు ప్రభుత్వం ఆసుపత్రికి చివరి రూ.1000 ఇస్తుంది. మాతృ వందన యోజనను ప్రభుత్వం 1 జనవరి 2017న ప్రారంభించింది. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు దేశంలోని 3 కోట్ల మందికి పైగా మహిళలు ఈ ప్రభుత్వ పథకంలో చేరారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




