PM Kisan: ఓట్లకు ముందు రైతులకు శుభవార్త.. ఖాతాలో డబ్బులు జమయ్యే అవకాశం..!

PM Kisan Is Likely To Be Released Before The 15th Phase Of Elections The Money Will Be Deposited In The Farmers Accounts
x

PM Kisan: ఓట్లకు ముందు రైతులకు శుభవార్త.. ఖాతాలో డబ్బులు జమయ్యే అవకాశం..!

Highlights

PM Kisan: పీఎం కిసాన్ యోజన వల్ల దేశంలో చాలామంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 2000 చొప్పున 3 విడతల్లో రూ.6000 అందిస్తారు.

PM Kisan: పీఎం కిసాన్ యోజన వల్ల దేశంలో చాలామంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 2000 చొప్పున 3 విడతల్లో రూ.6000 అందిస్తారు. ఇప్పటి వరకు 14 ఇన్‌స్టాల్‌మెంట్లు అందించారు. ఇప్పుడు 15 వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 15 విడత ఓట్లకు ముందుగానే రిలీజ్‌ అవుతాయని అధికారులు చెబుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

PM-కిసాన్ యోజన అర్హతలు

భర్త, భార్య, మైనర్ పిల్లలతో కూడిన చిన్న,సన్నకారు రైతు కుటుంబాలు వారి పేర్లపై సాగు భూమిని కలిగి ఉంటే PM-KISAN పథకానికి అర్హులు అవుతారు. భూస్వాములు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజ్యాంగబద్ధమైన పదవిని కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. మునిసిపల్ కార్పొరేషన్‌ల మాజీ, ప్రస్తుత మేయర్‌లు, జిల్లా పంచాయతీల చైర్మన్‌లు, అలాగే రాష్ట్ర అసెంబ్లీలు, రాష్ట్ర శాసన మండలి, లోక్‌సభ లేదా రాజ్యసభ మాజీ లేదా ప్రస్తుత సభ్యులు ఈ పథకానికి అర్హులు కాదు.

PM-కిసాన్ ప్రయోజనాలు

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. దీని కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతు ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలలో రూ.6,000 జమ అవుతాయి. రాష్ట్రాలు/యుటిలు అర్హులైన భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాల డేటాబేస్‌ను సిద్ధం చేస్తాయి. పారదర్శకత కోసం పంచాయతీల్లో జాబితాలను ప్రదర్శిస్తారు. సిస్టమ్ రూపొందించిన SMS ద్వారా లబ్ధిదారులకు సమాచారం అందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories