Pirojsha Godrej : గోద్రేజ్ సామ్రాజ్యంలో కొత్త శకం.. త్వరలో పిరోజ్షా గోద్రేజ్ చేతికి పగ్గాలు!

Pirojsha Godrej : గోద్రేజ్ సామ్రాజ్యంలో కొత్త శకం.. త్వరలో పిరోజ్షా గోద్రేజ్ చేతికి పగ్గాలు!
x

Pirojsha Godrej : గోద్రేజ్ సామ్రాజ్యంలో కొత్త శకం.. త్వరలో పిరోజ్షా గోద్రేజ్ చేతికి పగ్గాలు!

Highlights

గోద్రేజ్ గ్రూప్‌లో నాయకత్వ మార్పు దిశగా కీలక నిర్ణయం.. సంస్థ భవిష్యత్ వ్యూహాలకు పిరోజ్షా గోద్రేజ్ నేతృత్వం.

ప్రముఖ భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్' తన నాయకత్వ మార్పిడికి సిద్ధమైంది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న నాదిర్ గోద్రేజ్ పదవీకాలాన్ని పొడిగించాలని కంపెనీ నిర్ణయించింది. ఆయన తర్వాత ఈ గ్రూప్ బాధ్యతలను పిరోజ్షా గోద్రేజ్ చేపట్టనున్నారు. ప్రస్తుత ఛైర్మన్ నాదిర్ గోద్రేజ్ (75) పదవీకాలాన్ని ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పొడిగించాలని కంపెనీ తన వాటాదారుల ఆమోదాన్ని కోరింది. ఆగస్టు 2026 నుంచి ఆది గోద్రేజ్ కుమారుడైన పిరోజ్షా గోద్రేజ్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. పిరోజ్షా ప్రస్తుతం GIGకి ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్‌గా, గోద్రేజ్ ప్రాపర్టీస్, గోద్రేజ్ క్యాపిటల్, గోద్రేజ్ ఫండ్ మేనేజ్‌మెంట్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.

ఏప్రిల్ 2024లో గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG) దీనిని ఆది గోద్రేజ్, నాదిర్ గోద్రేజ్ నడిపిస్తున్నారు. ఈ విభజన ప్రక్రియలో పిరోజ్షా గోద్రేజ్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన సోదరీమణులు నిసాబా గోద్రేజ్, తాన్యా దుబాష్ కూడా గ్రూప్‌లో కీలక పదవుల్లో ఉన్నారు. అలాగే నాదిర్ గోద్రేజ్ కుమారులు బుర్జిస్, హోర్మాజ్ద్ కూడా వ్యాపార బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు.కొత్త బాధ్యతలు చేపట్టాక, పిరోజ్షా గోద్రేజ్ ప్రధానంగా ఆరు రంగాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

ఇవే ఆ ఆరు రంగాలు..

* FMCG (నిత్యవసర వస్తువులు)

* రియల్ ఎస్టేట్

* రసాయనాలు

* వ్యవసాయం

* ఆర్థిక సేవలు

* వ్యాపారంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మార్కెట్‌లో అగ్రగామిగా నిలపడం ఆయన ప్రధాన లక్ష్యాలుగా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే..

గోద్రేజ్ గ్రూప్‌లోని ఐదు ప్రధాన కంపెనీల ప్రస్తుత విలువ సుమారు రూ.2.27 లక్షల కోట్లు అని అంచనా. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు అన్నీ కలిపి రూ.53,813 కోట్ల ఆదాయాన్ని, రూ.4,529 కోట్ల లాభాన్ని సంపాదించాయి. నిజానికి గోద్రేజ్ కుటుంబ విభజన తర్వాత గ్రూప్ కంపెనీల షేర్లు మిశ్రమంగా స్పందించాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గోద్రేజ్ ఆగ్రోవెట్ (17% లాభం), గోద్రేజ్ ఇండస్ట్రీస్ (8% లాభం) పుంజుకున్నాయి. అయితే అదే సమయంలో మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ (31% తగ్గుదల), ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ (50% తగ్గుదల) నష్టాలను చవిచూశాయి. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గోద్రేజ్ గ్రూప్, ఇప్పుడు యువ నాయకత్వంలోకి వెళ్తోంది. పిరోజ్షా గోద్రేజ్ నాయకత్వంలో ఈ పారిశ్రామిక దిగ్గజం ఎలాంటి విజయాలు అందుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories