2020 లో పెరగనున్న మారుతీ సుజికీ ధరలు

2020 లో పెరగనున్న మారుతీ సుజికీ ధరలు
x
Highlights

కార్ల తయారీలో ముందంజలో ఉన్న మారుతీ సుజుకీ కంపెనీ కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మారుతీ కంపెనీ కార్ల ధరలను పెంచనుందని...

కార్ల తయారీలో ముందంజలో ఉన్న మారుతీ సుజుకీ కంపెనీ కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మారుతీ కంపెనీ కార్ల ధరలను పెంచనుందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల తయారీకి సంబంధించిన ముడిసరుకుల ధరలను కంపెనీలు పెంచిన నేపద్యంలో కార్ల ధరలను కూడా పెంచవలసి వస్తుందని రెగ్యూలేటరీ ఫైలింగ్ లో పేర్కొంది.

2020 జనవరి నుంచి సుజికీ కంపెనీలో నూతనంగా వచ్చిన కొన్ని మోడల్ల ధరలను పెంచుతామని తెలిపింది. కాకపోతే ఏయే మోడల్ల ధరలను పెంచారో అన్న విషయాలను మాత్రం స్పష్టం చేయలేదు. ఇదిలా ఉంటే ఈ కంపెనీ తయారు చేసిన ఆల్టో, ఎస్ ప్రెస్సో, వేగనార్, స్విఫ్ట్, సెలిరియో, డిజైర్, సియాజ్ అమ్మకాలు గత నెలతో పోల్చుకుంటే 3.2 శాతం తగ్గాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories