కొత్త రూల్స్ ధాటికి లగ్జరీ కార్లు రోడ్డున.. రూ.84 లక్షల బెంజ్ కారు రూ.2.5 లక్షలకు అమ్మకం!

ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వాహన నిబంధనలు లగ్జరీ కార్ల యజమానులకు పెద్ద కష్టంగా మారాయి. కాలుష్య నియంత్రణ చర్యలలో భాగంగా 10 సంవత్సరాలు దాటి పోయిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇకపై నగరంలో నడవడానికి అనుమతి ఉండదు.

Ramya Vegirouthu
Published on: 2 July 2025 7:18 PM IST
కొత్త రూల్స్ ధాటికి లగ్జరీ కార్లు రోడ్డున.. రూ.84 లక్షల బెంజ్ కారు రూ.2.5 లక్షలకు అమ్మకం!
X

కొత్త రూల్స్ ధాటికి లగ్జరీ కార్లు రోడ్డున.. రూ.84 లక్షల బెంజ్ కారు రూ.2.5 లక్షలకు అమ్మకం!

Luxury Car :ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వాహన నిబంధనలు లగ్జరీ కార్ల యజమానులకు పెద్ద కష్టంగా మారాయి. కాలుష్య నియంత్రణ చర్యలలో భాగంగా 10 సంవత్సరాలు దాటి పోయిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇకపై నగరంలో నడవడానికి అనుమతి ఉండదు. ఇంధనం పోసేందుకు కూడా బంకులు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి కొనుగోలు చేసిన కార్లను యజమానులు ఏం చేయాలో తెలియక నష్టాల్లో పడుతున్నారు.

లక్షల్లో కొనుగోలు చేసిన కార్లను ఇప్పుడు లక్షల్లోనే కాదు, కొన్ని లక్షల్లో కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి, మెర్సిడెస్ బెంజ్ ML350 అనే లగ్జరీ SUVను రూ.84 లక్షలకు కొనుగోలు చేసిన వరుణ్ విజ్ అనే వ్యక్తి, కేవలం రూ.2.5 లక్షలకు అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. అంతేకాదు, ఆ కారు ఇప్పటికీ అద్భుతమైన స్థితిలో ఉందని, కేవలం 1.35 లక్షల కిలోమీటర్ల ప్రయాణమే చేశిందని ఆయన చెబుతున్నారు.

ఇక రితేష్ గండోత్రా అనే మరో వ్యక్తి తన కారును బాగా మెయింటేన్ చేశానని, కేవలం 74,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని, ఆ కారు ఇంకా చాలా కాలం సర్వీస్ చేయగలదని చెబుతూ తన అసంతృప్తిని సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు.

ఈ మార్గదర్శకాలు వలన ఎలాంటి వారంటీ లేకుండానే అనేక లగ్జరీ వాహనాలు తమ యజమానులను విడిచి బజారులో తక్కువ ధరకు అమ్మబడుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు వాహనాలను తరలించడమో లేక స్క్రాప్ చేయడమో ఒక్కటే మార్గం మిగిలిపోతోంది.

ఢిల్లీ ప్రభుత్వ ఆంక్షల కారణంగా, మంచి కండీషన్‌లో ఉన్నా, తక్కువ ప్రయాణం చేసినా కార్లు వాహన యజమానులకు పెద్ద నష్టాన్ని మిగులుస్తున్నాయి. దీంతో లగ్జరీ కార్ల ఓనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story