Budget 2025: బడ్జెట్ లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం? రూ. 5లక్షలకు పెంపు?


Budget 2025: కేంద్రంలోని మోదీ సర్కార్ రైతులకు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది .రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే స్కీములు కూడా ఎన్నో ఉన్నాయి....
Budget 2025: కేంద్రంలోని మోదీ సర్కార్ రైతులకు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది .రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే స్కీములు కూడా ఎన్నో ఉన్నాయి. వ్యవసాయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించేందుకు స్కీమును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీము ప్రస్తుతం రూ. 3లక్షలు ఉండగా దానిని వచ్చే బడ్జెట్ లో రూ. 5లక్షలకు పెంచే ఛాన్స్ ఉంది.
రానున్న బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ను రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంచే ఛాన్స్ ఉంది. దీనికి ముందు కేసీసీ లిమిట్ లో చివరి మార్పు 2006-07 సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ను పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అలాగే కేసీసీ లిమిట్ పెంచితే రైతులకు వ్యవసాయం చేయడం మరింత సులభం అవుతుంది. విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం రాదు. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ సుమారు 26ఏళ్ల క్రితం 1998లో ప్రారంభించింది కేంద్రం. ఈ స్కీము కింద వ్యవసాయం, సంబంధిత పనులు చేసే రైతులకు 9శాతం వడ్డీకి స్వల్పకాలిక రుణాలను అందిస్తారు.
ఈ స్కీము ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం రుణంపై వసూలు చేసే వడ్డీపై 2శాతం రాయితీని కూడా అందిస్తుంది. అదే సమయంలో మొత్తం రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు ప్రోత్సాహకంగా మరో 3శాతం రాయితీని కూడా ఇస్తారు. అంటే ఈ రుణాన్ని రైతులకు కేవలం 4శాతం వార్షిక వడ్డీకే అందిస్తారు. జూన్ 30, 2023 నాటికి అలాంటి రుణాలు తీసుకున్న వారి సంఖ్య 7.4కోట్లకు పైగానే ఉంది. 8.9లక్షల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



