
Inflation: సామాన్యులకు ఊరట.. 6 ఏళ్ల కనిష్టానికి దేశంలో ద్రవ్యోల్బణం
Inflation: సామాన్యులకు ఊరట కలిగించే వార్త. దేశంలో ద్రవ్యోల్బణం గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి చేరుకుంది.
Inflation: సామాన్యులకు ఊరట కలిగించే వార్త. దేశంలో ద్రవ్యోల్బణం గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి చేరుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.34 శాతానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధానం, ఆహార డిమాండ్ను ప్రభుత్వం నిరంతరం తీర్చడమేనని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ద్రవ్యోల్బణం 2018-19 తర్వాత అత్యల్ప స్థాయికి చేరుకుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడమే కాకుండా, స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడం వల్లే ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని పేర్కొంది. ఆహార ధరలు తగ్గడం, అధిక బేస్ ఎఫెక్ట్ కారణంగా వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.34 శాతానికి తగ్గింది.
సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.61 శాతంగా, గత ఏడాది మార్చిలో 4.85 శాతంగా ఉంది. అయితే ఫిబ్రవరి 2024లో ఇది 3.75 శాతంగా, మార్చి 2024లో 8.52 శాతంగా నమోదైంది. ఈ బుధవారం ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను ప్రకటిస్తూ, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, ఆహార ధరల తగ్గుదల దీనికి మద్దతునిచ్చిందని అన్నారు. ఆర్థిక సంవత్సరం 2026లో ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల్లో వచ్చిన తగ్గుదలకు ఆర్బీఐ ద్రవ్య విధానమే కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రజల నుండి వస్తున్న ఆహార డిమాండ్ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీరుస్తోందని కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్బీఐ విధానాల కారణంగానే ధరలు స్థిరంగా ఉన్నాయని పేర్కొంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




