Gold Rate Today : మళ్లీ టాప్ గేర్‎లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి.. ఈ రోజు ఎంత పెరిగిందంటే ?

Gold Rate Today : మళ్లీ టాప్ గేర్‎లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి.. ఈ రోజు ఎంత పెరిగిందంటే ?
x
Highlights

మళ్లీ టాప్ గేర్‎లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి.. ఈ రోజు ఎంత పెరిగిందంటే ?

Gold Rate Today : బంగారం అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు.. భారతీయ మహిళలకు అది ఒక సెంటిమెంట్, ఆభరణం, అవసరానికి ఆదుకునే ఆపద్బాంధవుడు. అందుకే పసిడి ధరలు పెరిగినా, తగ్గినా మహిళల దృష్టి ఎప్పుడూ వాటిపైనే ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా పసిడి ప్రియులకు, ముఖ్యంగా గృహిణులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. నేడు 2026, ఫిబ్రవరి 12వ తేదీ గురువారం కూడా అదే ట్రెండ్ కొనసాగుతూ ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల గడచిన నాలుగు రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.820 పెరగగా, 22 క్యారెట్లపై రూ.750 వరకు పెరిగింది.

నేడు ఫిబ్రవరి 12న ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,59,610 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే ఇది రూ.800 పైగా పెరిగింది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,310 కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఈ ధరలు మరి కాస్త ఎక్కువగా ఉండి 24 క్యారెట్లు రూ.1,59,760 కి, 22 క్యారెట్లు రూ.1,46,460 కి చేరాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులు పెరిగిన ధరల పట్ల కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, వెండి మాత్రం ఈరోజు పెట్టుబడిదారులకు కాస్త నిరాశను, కొనుగోలుదారులకు ఊరటను కలిగించింది. కిలో వెండి ధరపై రూ.100 మేర తగ్గి, మళ్ళీ మూడు లక్షల రూపాయల దిగువకు అంటే రూ.2,99,900 కు చేరుకుంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో నిలకడ లేకపోవడంతో ఇన్వెస్టర్లు కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 5,066 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా డాలర్ విలువ క్షీణించడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించబోతుందనే సంకేతాలు ఇవ్వడం వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే గడచిన నాలుగు రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టకుండా వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.

బంగారం ధరలు ఇప్పుడు భారీగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా, గతంలో నమోదైన ఆల్ టైమ్ హై (సుమారు రూ.1,80,000)తో పోలిస్తే ఇప్పటికీ సుమారు రూ.20,000 తక్కువగానే ట్రేడ్ అవుతున్నాయి. అందుకే ప్రస్తుతం ఉన్న ధరలు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి కొంత మేర అనుకూలమని చెప్పవచ్చు. అయితే మునుముందు అంతర్జాతీయ పరిస్థితులు మారకపోతే ధరలు మళ్ళీ లక్షా ఎనభై వేల మార్కును చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories