Radhakishan Damani: డీమార్ట్ ఓనర్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు!

Radhakishan Damani: పెట్టుబడిదారుడి నుండి వ్యాపారవేత్త వరకు డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమాని కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

admin
Updated on: 21 Aug 2021 1:17 PM IST
D Mart Owner Radhakishan Damani Now Listed in World 100 Richest Persons List with 1.42 lakh Crore Rupees of Properties
X

Radhakishan Damani: డీమార్ట్ ఓనర్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు!

Radhakishan Damani: పెట్టుబడిదారుడి నుండి వ్యాపారవేత్త వరకు డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమాని కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. కిరాణా దుకాణం డి-మార్ట్ యజమాని రాధాకిషన్ దమాని ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 100 మందిలోకి ప్రవేశించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ప్రపంచంలోని 100 మంది ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అతను రూ.1.42 లక్షల కోట్ల ఆస్తులతో 98 వ స్థానంలో నిలిచాడు.

డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. నిజానికి స్టాక్‌ మార్కెట్లలో మధ్య, చిన్నతరహా కంపెనీలలో అత్యధికంగా ఇన్వెస్ట్‌ చేసే దమానీ.. వేల్యూ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందారు. పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తుంటారు. అయితే సంపద వృద్ధికి ప్రధానంగా ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ దోహదం చేసింది. దమానీకి అధిక వాటాలున్న లిస్టెడ్‌ కంపెనీలలో వీఎస్‌టీ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, ట్రెంట్‌లను పేర్కొనవచ్చు.

రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో ఒక సాధారణ మార్వాడీ కుటుంబంలో 1954 మార్చి 15న పుట్టారు రాధాకిషన్. వ్యాపారాల మీద ఆసక్తితో ఆయన మొదట బాల్ బేరింగ్ వ్యాపారం ప్రారంభించారు. ఆయన తండ్రి మరణించడంతో ఆ వ్యాపారాన్ని వదిలేసి స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టారు. అతని తండ్రి స్టాక్ బ్రోకర్, కాబట్టి అతనికి చిన్నతనం నుండే మార్కెట్ గురించి కొంచెం అవగాహన ఉంది. భాయ్ గోపీకిషన్ దమానితో కలిసి స్టాక్ మార్కెట్‌పై పూర్తి దృష్టి పెట్టారు. 5000 రూపాయలతో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టి, నేడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 98 వ స్థానానికి చేరుకున్నారు. మొదటగా స్టాక్ మార్కెట్ లో రాధాకిషన్ చిన్న షేర్లు కొనడం..అమ్మడం చేస్తూ వచ్చారు. సరిగ్గా అదే సమయంలో (1990 ప్రాంతంలో) స్టాక్ మార్కెట్లను కుదిపేసిన హర్షద్ మెహతా దెబ్బతో చిన్న ఇన్వెస్టర్లు కుదేలు అయిపోయారు. అయినా, రాధాకిషన్ తన తెలివితేటలతో నిలదొక్కుకున్నారు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో 1995 ముందువరకూ ఈయన అతి పెద్ద షేర్ హోల్డర్ గా ఉండేవారని చెబుతారు. హర్షద్ మెహతా స్కామ్ గొడవ సర్దుమణిగాకా 1992 లో రాధాకిషన్ స్టాక్ మార్కెట్ వ్యాపారం లాభాల్లో దూసుకు పోయింది.

అవెన్యూ సుపర్మార్ట్స్ విజయం సాధించినప్పటికీ విజయవంతమైన వ్యాపారం తర్వాత స్టాక్‌లో పెట్టుబడి పెట్టలేదు దమాని స్టాక్ మార్కెట్ నుండి దూరం కాలేదు. అతను ఇప్పటికీ డజనుకు పైగా కంపెనీలలో ఒక శాతం కంటే ఎక్కువ షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులలో ఒకడు. బహుశా భారతదేశంలో అలా చేసిన ఏకైక పెద్ద వ్యాపారవేత్త దమనీ ఒక్కరే కావడం గమనార్హం.

admin

admin

Next Story