ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భగ్గుమంటున్న చమురు ధరలు

*బ్యారెల్ ముడి చమురుపై 5 డాలర్ల మేర పెంపు, తాజా ధర 108.60 *భారత్‌లోనూ త్వరలో పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్

Rama Rao
Updated on: 2 March 2022 4:45 PM IST
Crude Oil Prices in the Wake of the Ukraine-Russia War
X

ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భగ్గుమంటున్న చమురు ధరలు

Crude Oil Prices: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలతో పాటు భారత్ మీదా పడనుంది. ప్రస్తుతం ఎన్నికల కారణంగా స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు త్వరలోనే రికార్డు స్థాయిలో పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం బ్యారెల్ ముడిచమురుపై 5 డాలర్ల మేర పెరిగింది. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్ ప్రకారం బెంచ్ మార్క్ యూఎల్ క్రూడ్ బ్యారెల్ ధర 5.24 డాలర్లు పెరిగి 108. 60 డాలర్లుకు చేరింది. ఇక భారత్‌లో 5.43 డాలర్లు ఎగబాకి 110.40 డాలర్లకు పెరిగింది.

Rama Rao

Rama Rao

Next Story