EPFO Alert: పీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్‌.. ఇదొక్కటి చేయకుంటే 7 లక్షలు కోల్పోయినట్లే..!

Alert for PF Customers if this Works you Will get 7 Lakh Rupees Know Full Details
x

EPFO Alert: పీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్‌.. ఇదొక్కటి చేయకుంటే 7 లక్షలు కోల్పోయినట్లే..!

Highlights

EPFO Alert: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) వల్ల ఏ ఒక్క ఉద్యోగికి కూడా నష్టం జరగదు.

EPFO Alert: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) వల్ల ఏ ఒక్క ఉద్యోగికి కూడా నష్టం జరగదు. ఖాతాదారులందరికి వారి వారి ఖాతాల్లో వడ్డీ జమ చేస్తుంది. కానీ కొన్నిసార్లు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా పాస్‌బుక్‌లో కనిపించదు. వాస్తవానికి ఈపీఎఫ్‌వో తన ఖాతాదారులకి ఈ-నామినేషన్‌ను తప్పనిసరి చేసింది. ఇది చేయకుంటే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలేరు. ఈ నామినేషన్ వల్ల ఖాతాదారుడి కుటుంబానికి సామాజిక భద్రత లభిస్తుంది. దీనికి సంబంధించి ఈపీఎఫ్‌వో నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.

ఈ-నామినేషన్ తప్పనిసరి

ఈపీఎఫ్‌వో తన సబ్‌స్క్రైబర్‌లకు నామినీ సమాచారాన్ని తెలియజేయడానికి ఈ-నామినేషన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఆ తర్వాత నామినీ పేరు, పుట్టిన తేదీ వంటి ఆన్‌లైన్ సమాచారం అప్‌డేట్ అవుతుంది. దీనివల్ల ఖాతాదారుడు మరణించిన సందర్భంలో పీఎఫ్‌, పెన్షన్ (EPS) బీమా (EDLI)కి సంబంధించిన డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి నామినీ/కుటుంబ సభ్యులకు ఇది సహాయపడుతుంది.

7 లక్షల రూపాయలు

ఈపీఎఫ్‌వో సభ్యులు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI)కింద బీమా రక్షణ సౌకర్యాన్ని పొందుతారు. పథకంలో నామినీకి గరిష్టంగా రూ. 7 లక్షల బీమా కవరేజీ అందుతుంది. ఏదైనా నామినేషన్ లేకుండా సభ్యుడు మరణిస్తే దావాను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ చేయండి. అంతేకాదు ఖాతాదారులు ఒకటి కంటే ఎక్కువ మందిని నామినీలుగా చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories