Guru Purnima 2025: రేపే గురు పూర్ణిమ.. ఒక్క చిన్న పని చాలు, శుభం మొదలవుతుంది!

ఈ ఏడాది జూలై 10న గురువారం నాడు గురు పూర్ణిమ పండుగ రాబోతోంది. ఇది ఆషాఢ మాసం పౌర్ణమి రోజున వస్తుంది. వ్యాస పూర్ణిమగా కూడా పిలవబడే ఈ పర్వదినం మహర్షి వేద వ్యాసుని జయంతిగా జరుపుకుంటారు.

Ramya Vegirouthu
Published on: 9 July 2025 7:31 PM IST
Guru Purnima 2025: రేపే గురు పూర్ణిమ.. ఒక్క చిన్న పని చాలు, శుభం మొదలవుతుంది!
X

Guru Purnima 2025: రేపే గురు పూర్ణిమ.. ఒక్క చిన్న పని చాలు, శుభం మొదలవుతుంది!

ఈ ఏడాది జూలై 10న గురువారం నాడు గురు పూర్ణిమ పండుగ రాబోతోంది. ఇది ఆషాఢ మాసం పౌర్ణమి రోజున వస్తుంది. వ్యాస పూర్ణిమగా కూడా పిలవబడే ఈ పర్వదినం మహర్షి వేద వ్యాసుని జయంతిగా జరుపుకుంటారు. వేద వ్యాసుడు మహాభారత రచయితగా మాత్రమే కాక, భగవద్గీతను లోకాలకు అందించిన గొప్ప ఋషి. అందుకే ఆయన్ని ఆదిగురువుగా భావించి పూజిస్తారు.

ఈ పుణ్యదినం గురువులకు, తల్లిదండ్రులకు, పెద్దలకు సమర్పించిన పవిత్రమైన రోజు. వారిని పూజించడం వల్ల జ్ఞానం, శాంతి, ఆనందం కలుగుతాయని నమ్ముతారు. గురువు లేని వారు శివుడు, విష్ణువు, గణేశుడు, సూర్యుడు, హనుమంతుడు, దుర్గాదేవి, శ్రీకృష్ణుని తమ ఆధ్యాత్మిక గురువులుగా భావించి పూజించవచ్చు. తల్లిదండ్రులను కూడా గురువులుగానే పూజిస్తే శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ రోజున దానం, పుణ్యకార్యాలు చేయడం, గంగాస్నానం, తులసి మొక్క వద్ద నెయ్యిదీపం వెలిగించడం విశేష ఫలితాలు ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు. చదువులో ఆటంకాలు ఎదుర్కొంటున్న విద్యార్థులు భగవద్గీతను చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడుతోంది. ఇది సాధ్యం కాకపోతే ఆవులకు సేవ చేయడం కూడా ఫలప్రదమని భక్తులు విశ్వసిస్తారు.

జాతకంలో గురు దోషం ఉన్నవారు “ఓం బృం బృహస్పతయే నమః” మంత్రాన్ని 11, 21, 51 లేదా 108 సార్లు గురు పూర్ణిమ రోజున జపిస్తే గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం ఉంది.

ఈ గురు పూర్ణిమ పర్వదినం... జ్ఞానం, కృతజ్ఞతలు, శాంతి, భక్తి పరమార్థాలకు దారితీసే రోజు కావడంతో అందరూ ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story