Ganesh Chaturthi 2025: మోదకాలతో పాటు ఈ 5 నైవేద్యాలు వినాయకుడికి ఎందుకు ప్రత్యేకం?

ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రావడం చాలా శుభప్రదంగా భావిస్తున్నారు. బుధ గ్రహం తెలివితేటలు, జ్ఞానం, కమ్యూనికేషన్‌కు సూచిక. వినాయకుడు కూడా ఇవన్నీ ప్రసాదించే దేవుడు కాబట్టి.. ఈ రోజు చేసే పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Ramya Vegirouthu
Published on: 26 Aug 2025 8:59 PM IST
Ganesh Chaturthi 2025: మోదకాలతో పాటు ఈ 5 నైవేద్యాలు వినాయకుడికి ఎందుకు ప్రత్యేకం?
X

Ganesh Chaturthi 2025: మోదకాలతో పాటు ఈ 5 నైవేద్యాలు వినాయకుడికి ఎందుకు ప్రత్యేకం?

ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రావడం చాలా శుభప్రదంగా భావిస్తున్నారు. బుధ గ్రహం తెలివితేటలు, జ్ఞానం, కమ్యూనికేషన్‌కు సూచిక. వినాయకుడు కూడా ఇవన్నీ ప్రసాదించే దేవుడు కాబట్టి.. ఈ రోజు చేసే పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మోదకాలతో పాటు మరో ఐదు నైవేద్యాలు సమర్పించడం వలన సంపద, ఆరోగ్యం, విజయాలు లభిస్తాయని విశ్వాసం ఉంది.

పసుపుతో కలిపిన బియ్యం

బియ్యం స్థిరత్వానికి, పసుపు శ్రేయస్సుకు చిహ్నాలు. ఒకన్నర కిలో బియ్యాన్ని పసుపుతో కలిపి సమర్పించడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుందని, పనులు సజావుగా పూర్తవుతాయని చెబుతారు.

కొబ్బరికాయ

కొబ్బరికాయను దేవతల ఫలం అంటారు. గట్టి టెంక అహంకారాన్ని, లోపలి తెల్లని గింజ పవిత్రతను సూచిస్తుంది. దీన్ని సమర్పించడం వల్ల ఆరోగ్యం, శాంతి కలుగుతాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు కొబ్బరికాయ కొట్టడం ఆటంకాలను తొలగిస్తుంది.

చెరకు గడ

చెరకు తీపి, ఐక్యత, ధైర్యానికి ప్రతీక. వినాయకుడికి సమర్పిస్తే కుటుంబంలో ప్రేమ పెరిగి, సంపద, దీర్ఘాయువు లభిస్తాయని నమ్మకం.

తామర పువ్వు

తామర పవిత్రతకు సంకేతం. కష్టాలను అధిగమించి విజయం సాధించడాన్ని సూచిస్తుంది. విద్యలో పురోగతి, వ్యాపారాల్లో విజయాలు సాధించాలనుకునే వారు తామర పువ్వు సమర్పిస్తారు.

అరటి ఆకు

అరటి ఆకు పవిత్రతకు సూచకం. దానిపై నైవేద్యం పెట్టడం వల్ల పూజ మరింత శ్రద్ధతో జరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

ఈసారి వినాయక చవితి బుధవారం రావడం వల్ల ఈ నైవేద్యాలను సమర్పిస్తే దేవుని అనుగ్రహం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story