కోరికలు తీర్చే గణపతి దేవాలయాలు – వినాయక చవితికి ప్రత్యేక ప్రాధాన్యం

భారతదేశంలో గణపతి ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రపంచప్రసిద్ధి పొందాయి. వినాయక చవితి సందర్భంగా ఈ ఆలయాలను దర్శించుకుంటే శుభఫలాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఐదు ప్రముఖ గణపతి ఆలయాల గురించి తెలుసుకుందాం.

Ramya Vegirouthu
Updated on: 22 Aug 2025 8:31 PM IST
కోరికలు తీర్చే గణపతి దేవాలయాలు – వినాయక చవితికి ప్రత్యేక ప్రాధాన్యం
X

కోరికలు తీర్చే గణపతి దేవాలయాలు – వినాయక చవితికి ప్రత్యేక ప్రాధాన్యం

భారతదేశంలో గణపతి ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రపంచప్రసిద్ధి పొందాయి. వినాయక చవితి సందర్భంగా ఈ ఆలయాలను దర్శించుకుంటే శుభఫలాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఐదు ప్రముఖ గణపతి ఆలయాల గురించి తెలుసుకుందాం.

1. ఖజ్రానా గణపతి ఆలయం – ఇండోర్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఖజ్రానా ప్రాంతంలో ఉన్న ఈ గణపతి ఆలయాన్ని 1735లో హోల్కర్ రాజవంశానికి చెందిన అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. గణేశుడి విగ్రహం వెనుక స్వస్తిక్ గుర్తు వేసి మోదకం నైవేద్యం పెడితే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయానికి మూడు ప్రదక్షిణలు చేసి గోడలకు దారాలు కడితేనే దర్శనం పూర్తి అయినట్లు భావిస్తారు. ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇది దేశంలో అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి.

2. జునా చింతామన్ గణేశ ఆలయం – మధ్యప్రదేశ్

సుమారు 1200 ఏళ్ల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయం జునా ప్రాంతంలో ఉంది. ఇక్కడ వినాయకుడు భక్తుల సమస్యలను "ఫోన్, లేఖ లేదా మొబైల్ ద్వారా వింటాడు" అన్న నమ్మకం ఉంది. ఒక జర్మనీ భక్తుడు గణపతికి చెవిలో తన సమస్య చెప్పగా అది త్వరగా పరిష్కారమైందని చెబుతారు. అప్పటి నుంచి ఈ పద్ధతి కొనసాగుతోంది.

3. త్రినేత్ర గణేశ దేవాలయం – రణథంబోర్, రాజస్థాన్

సుమారు 1000 సంవత్సరాల నాటి ఈ ఆలయం రణథంబోర్ కోటలో ఉంది. మహారాజా హర్మీర్ దేవ్ చౌహాన్ నిర్మించిన ఈ ఆలయంలో గణపతి "త్రినేత్రుడు" రూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ గణేశుడు స్వయంగా వెలిసినట్టుగా నమ్మకం ఉంది.

4. మండై గణపతి ఆలయం – పూణే, మహారాష్ట్ర

పూణేలోని అతి పెద్ద గణపతి ఆలయం ఇది. "అఖిల గణపతి మండలం"గా ప్రసిద్ధి చెందింది. దేశ, విదేశాల నుంచి భారీగా భక్తులు ఇక్కడకు వచ్చి గణపతిని దర్శించుకుంటారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పండుగ వాతావరణం ఉంటుంది.

5. ఉచ్చి పిల్లయార్ ఆలయం – తిరుచ్చి, తమిళనాడు

తిరుచ్చి నగరంలోని కొండపై ఉన్న ఈ ఆలయం దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందింది. చైల్ రాజులు కొండను చదును చేసి ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. పర్వత శిఖరం మీద ఉండటంతో ఇక్కడి గణేశుడిని "హై పిల్లయార్" అని పిలుస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story