Upcoming Electric SUVs: ఇక నో వెయిటింగ్.. లాంచ్‌కు రెడీగా నాలుగు ఎస్‌యూవీలు.. 500కి.మీ దూసుకుపోవడమే..!

Upcoming Electric SUVs: భారతీయ వినియోగదారులలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రా వంటి ప్రముఖ కార్ల తయారీదారులు రాబోయే రోజుల్లో తమ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను అనేకం విడుదల చేయబోతున్నారు.

Vamsi Krishna
Published on: 26 May 2025 8:14 PM IST
Upcoming Electric SUVs: ఇక నో వెయిటింగ్.. లాంచ్‌కు రెడీగా నాలుగు ఎస్‌యూవీలు.. 500కి.మీ దూసుకుపోవడమే..!
X

Upcoming Electric SUVs: భారతీయ వినియోగదారులలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రా వంటి ప్రముఖ కార్ల తయారీదారులు రాబోయే రోజుల్లో తమ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను అనేకం విడుదల చేయబోతున్నారు. రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది., 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందించే 4 మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం.

Maruti Suzuki E-Vitara

మారుతి సుజుకి సెప్టెంబర్ 2025 నాటికి భారత మార్కెట్లో e Vitaraను విడుదల చేయనుంది. బ్రాండ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్ Heartect-E ఆధారంగా ఉంటుంది. ఈవీ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది, అంటే 61.1కిలోవాట్, 48.9 కిలోవాట్. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది.

Tata Harrier EV

టాటా తన ప్రసిద్ధ ఎస్‌యూవీ హారియర్ యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ జూన్ 3న హారియర్ EVని ప్రారంభించనుంది. పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే, టాటా హారియర్ ఈవీ 75 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని వెనుకకు ఉపయోగిస్తుంది, ఇది త్వరిత ఛార్జింగ్ కోసం ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా ఎస్‌యూవీలో చిన్న బ్యాటరీ యూనిట్ కూడా ఉంటుంది. హారియర్ ఈవీ పూర్తిగా ఛార్జ్ చేస్తే దాని కస్టమర్లకు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ పరిధిని అందించగలదు.

Mahindra XEV 7E

ఈ సంవత్సరం ప్రారంభంలో మహీంద్రా XEV 7e ఫోటోలె లీక్ అయ్యయి. ఇవి ఉత్పత్తికి దగ్గరగా ఉన్న మోడల్‌గా చూపిస్తున్నాయి. ఈ ఈవీ మహీంద్రా AQV 700 ఎలక్ట్రిక్ వేరియంట్ కావచ్చు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఈవీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది.

Tata Sierra EV

టాటా తన సరికొత్త సియెర్రా కారును 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు షోరూమ్‌లలోకి రానుంది. టాటా సియెర్రా ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను కస్టమర్లకు అందించగలదని మీడియా నివేదికలలో చెబుతున్నాయి.

Vamsi Krishna

Vamsi Krishna

Next Story