ఏపీలో మరో సర్వే జోస్యం.. అధికారం ఆ పార్టీదేనట..

ఏపీలో మరో సర్వే జోస్యం.. అధికారం ఆ పార్టీదేనట..
x
Highlights

ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో సర్వే చేసి టీఆర్ఎస్ పార్టీకి 92 స్థానాల వస్తాయని చెప్పిన వేణుగోపాల్ రావు తాజాగా ఏపీ ఎన్నికల్లో కూడా సర్వే చేసినట్టు...

ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో సర్వే చేసి టీఆర్ఎస్ పార్టీకి 92 స్థానాల వస్తాయని చెప్పిన వేణుగోపాల్ రావు తాజాగా ఏపీ ఎన్నికల్లో కూడా సర్వే చేసినట్టు తెలిపారు. తన సర్వే ప్రకారం ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారం చేజిక్కించుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ 121 నుంచి 130 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాదిస్తుందని.. టీడీపీ 45 నుంచి 54 సీట్లు సాధిస్తుందని. జనసేన ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని చెప్పారు.

అలాగే వైఎస్సార్‌సీపీ 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీడీపీ 4 ఎంపీ సీట్లు గెల్చుకుంటుంది. జనసేనకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం లేదని అన్నారు. ఓటు శాతం పరంగా చూసుకుంటే వైఎస్సార్‌సీపికి 48.1 శాతం ఓట్లు రానున్నాయని. టీడీపీకి 40.1 శాతం ఓట్లు వస్తాయి. జనసేన 8 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదని ఆయన సర్వేలో వెల్లడైనట్టు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories