Mp Raghurama Krishnam Raju Delhi Tour: ఢిల్లీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ..

Mp Raghurama Krishnam Raju Delhi Tour: ఢిల్లీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ..
x
Highlights

Mp Raghurama Krishnam Raju: r: ఏపీలో రాజకీయాలు కాక‌రేపుతున్నాయి. అధికార పార్టీలో ముస‌లం తార‌స్థాయికి చేరింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీ ఢిల్లీకి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

YSRCP Mp Raghurama Krishnam Raju Delhi Tour: ఏపీలో రాజకీయాలు కాక‌రేపుతున్నాయి. అధికార పార్టీలో ముస‌లం తార‌స్థాయికి చేరింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీ ఢిల్లీకి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై అనుచితవ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీనిపై వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. అయితే నోటీసును అందుకున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దీనిపై ఘాటు రిప్లై ఇచ్చారు. విజయసాయరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీస్ అందిందని పేర్కొంటూ విజ‌యసాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. అస‌లు వైసీపీలో క్రమశిక్షణ సంఘం ఉందా..క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా..? సంఘం మినిట్స్ ఉంటే నాకు పంపండి.. క్రమశిక్షణ సంఘం చైర్మన్, సభ్యులు ఏవరు..? అంటూ విజ‌య‌సాయిరెడ్డికి సంబంధం ఎంటి అని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు.

అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. దీంతో రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చర్చ‌కు దారితీసింది. ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు ఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఎన్నికల కమిషన్‌, హోంశాఖ అధికారులను కలిసే అవకాశముందని సమాచారం. త‌న‌ నియోజకవర్గ పర్యటనలో కేంద్ర బలగాలతో భ‌ద్ర‌త‌ కల్పించాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఎంపీ విజ్ఞప్తిని స్పీకర్‌ అదే రోజు హోంశాఖ కార్యదర్శికి బ‌దిలీ చేశారు. రఘురామకృష్ణమరాజు ఇవాళ లోక్ స‌భ స్పీకర్ బిర్లానును కూడా కలిసే అవకాశముంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories