
ఇటీవల ఏసీబీ అధికారులపై డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేసిన ఘటన మరవకముందే ఉద్యోగులపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు....
ఇటీవల ఏసీబీ అధికారులపై డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేసిన ఘటన మరవకముందే ఉద్యోగులపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రభుత్వ మంత్రుల ఎదుటే తన గోడు వెల్లబోసుకున్నారు. విజయనగరం కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో తనకు ఆరు నెలలుగా పాస్బుక్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణల ఎదుట ఎమ్మెల్యే తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే అయిన తనకే పాసు పుస్తకాలు రాకుంటే.. ఇక సాధారణ ప్రజలు, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా సమావేశంలో ఎమ్మెల్యే ఫిర్యాదు అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. మరోవైపు, తెలంగాణాలో రెవెన్యూ ఉద్యోగి విజయారెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే.. ఈ ఘటన తరువాత ప్రభుత్వ అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటన స్పూర్తితో కొందరు ఉద్యోగులుపై రైతులు తిరగబడుతున్నారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire