జనసేన కార్యకర్తలను కూడా పవన్ మోసం చేస్తున్నారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి

జనసేన కార్యకర్తలను కూడా పవన్ మోసం చేస్తున్నారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ పేద ప్రజలకు అండగా ఉన్న వైసీపీని ప్రశ్నిస్తున్నారు కానీ పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. గుంటూరులో మీడియా సమావేశంలో పాల్గొన్న అయన పవన్‌ పై ఈ వాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనపై అయన తప్పుబట్టారు.. చంద్రబాబు మోసం చేసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజధాని ప్రాంతంలో పవన్‌ పర్యటించలేదని ఆళ్ల విమర్శించారు.

ఇక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఉన్న పరిజ్ఞానం కూడా పవన్‌ కళ్యాణ్‌కు లేదని అయన ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌‌ తీసుకుంటున్న నిర్ణయాలకీ జనసేన ఎమ్మెల్యే రాపాక మద్దతు పలుకుతున్నారని అయన అన్నారు. గత ఐదేళ్లు చంద్రబాబుతో పవన్‌ లోపాయికారిగా స్నేహం చేసి ఇప్పుడు రాజధాని ప్రాంతానికి వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోకుండా వారిని రెచ్చగొట్టడం ఎంతవరకు వరకు సమంజసం అని ఆళ్ల ప్రశ్నించారు. పవన్‌ రైతులను, జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారని అయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories