వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు

వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
x
Highlights

*మేనిఫెస్టోలోని మెజారిటీ అంశాలు నవరత్నాలే *పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన అంశాలు ఉన్నాయి *ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి...

*మేనిఫెస్టోలోని మెజారిటీ అంశాలు నవరత్నాలే

*పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన అంశాలు ఉన్నాయి

*ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50వేలు ఇస్తాం.

*పంటవేసే సమయానికి మే నెలలోనే 12500 ఇస్తాం

*పంటబీమా కోసం రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రిమియం మొత్తం మా ప్రభుత్వమే చెల్లిస్తుంది

*రైతన్నకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.. రైతులకు పగటిపూట ఉచితంగా 9 గంటల కరెంటు ఇస్తాం

*ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయిన్నరకే చార్జీకే కరెంటు అందిస్తాం

*మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం

*పంట వేసేముందే.. ఆయా పంటలకు లభించే మద్దతు ధరలను ప్రకటిస్తాం.. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాం.

*నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయక నిధిని ఏర్పాటుచేస్తాం

*ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తాం

*మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం

*రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే.. ప్రతిపాడి రైతుకు లీటరుకు నాలుగు రూపాయలు బోనస్‌ ఇస్తాం

*వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డుట్యాక్స్‌, టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తాం

*ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ. ఏడు లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి.. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం.

*కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేవిధంగా చర్యలు.. 11 నెలలు మించకుండా కౌలు రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్టసవరణ చేస్తాం

*కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తాం.. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, సబ్సిడీలు వారికి అందేలా చేస్తాం

*నవరత్నాల్లో రైతులకు ప్రకటించిన మిగిలిన అన్ని హామీలు.. పంట బీమా దగ్గరి నుంచి వడ్డీలేని రుణాల వరకు.. 9 గంటల ఉచిత విద్యుత్‌ నుంచి గిట్టుబాటు ధరల గ్యారెంటీ వరకు.. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా ద్వారా ఏడు లక్షలు రూపాయలు.. ఇలా ప్రతి అంశామూ కౌలు రైతులందరికీ వర్తింపజేస్తాం.

*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతుభరోసా కింద ఏటా 12,500 రూపాయలు వీరికి అదనంగా అందజేస్తాం

*పిల్లల చదువుకు ఏ పేదింటి తల్లి భయపడకూడదు

*పిల్లలను బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15వేలు అందిస్తాం

*వైఎస్సార్‌ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కాచెల్లెళ్లకు తోడుగా ఉంటాం

*ప్రస్తుత కార్పొరేషన్‌ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఇస్తాం. ప్రస్తుతం అరకొరగా అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం

*45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా మొదటి ఏడాది తరువాత దశలవారీగా రూ. 75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం

*ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గిస్తాం

*అవ్వా తాతలకు పింఛన్‌ రూ. 3వేల వరకు పెంచుకుంటూపోతాం

*వికలాంగులకు పింఛన్‌ రూ. మూడు వేలు ఇస్తాం

*పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం

*పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్థికి అందిస్తాం

*ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం

*ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం

*ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం

*ఇల్లు ఇచ్చే రోజును ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌

అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం

*వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికీ, నెలకు 40వేల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికీ *వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం

*ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యచికిత్స అందజేస్తాం

*హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై..ఇలా ఎక్కడ చికిత్స చేయించుకున్నా.. మెరుగైన ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం అన్ని రకాల వ్యాధుల ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తాం

*జబ్బుకు సంబంధించిన ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు

*కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రత్యేకంగా నెలనెలా రూ. 10వేల పెన్షన్‌ అందజేస్తాం

*ఆరోగ్య శ్రీ సేవలను ఇంకా మెరుగ్గా.. పకడ్బందీగా అందిస్తూనే.. మరోవైపు రెండేళ్లలోగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతాం

*ప్రస్తుత ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో ఫొటోలు మీ ముందు ఉంచుతాం

*రెండేళ్ల తర్వాత అవే ఆస్పత్రుల దశాదిశ మార్చిన తర్వాత వాటి ముఖ చిత్రాలు, ఫొటోలను మళ్లీ మీ ముందు ఉంచుతాం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల సంఖ్యను అవసరమైనమేరకు పూర్తిగా పెంచుతాం

Show Full Article
Print Article
Next Story
More Stories