సుజనా చౌదరిపై ఓ రేంజిలో ఫైర్ అయిన వైసీపీ ఎంపీలు

సుజనా చౌదరిపై ఓ రేంజిలో ఫైర్ అయిన వైసీపీ ఎంపీలు
x
Highlights

వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీకి టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు ఎంపీ సుజనా చౌదరి. అయితే ఆయన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీలు....

వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీకి టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు ఎంపీ సుజనా చౌదరి. అయితే ఆయన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీలు. సుజనా చౌదరికి టచ్ లో ఉన్న తమ ఎంపీల పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సుజనా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. అసలు సుజనా బీజేపీ నాయకుడా లేక టీడీపీ నాయకుడా అని అన్నారు. సుజనా బీజేపీలో ఉండి టీడీపీకి ఏజంటుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసు నుంచి బయటపడటానికి మాత్రమే ఆయన బిజెపిలో చేరారని విమర్శించారు.

ఎవరైనా గూగుల్‌లో అతని పేరును శోధిస్తే బ్యాంక్ డిఫాల్టర్ అని వస్తుందన్నారు. అలాగే.. విరాళాలు ఇచ్చి రాజ్యసభ పదవి కొనుకున్న సుజనా చౌదరికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు యూనివర్సిటీ భూములను అమ్మినట్లు నిరూపించకపోతే సుజనా పార్లమెంట్‌ వద్ద ముక్కు నేలకు రాయాలని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories