'వైఎస్ఆర్ ఛాయలో' వల్లీశ్వర్ పుస్తకావిష్కరణ..

వైఎస్ఆర్ ఛాయలో వల్లీశ్వర్ పుస్తకావిష్కరణ..
x
Highlights

సీనియర్ పాత్రికేయులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ పబ్లిక్ రిలేషన్ షిప్ ఆఫీసర్ గా పనిచేసిన జీ. వల్లీశ్వర్.. 'వైఎస్ఆర్ ఛాయలో'...

సీనియర్ పాత్రికేయులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ పబ్లిక్ రిలేషన్ షిప్ ఆఫీసర్ గా పనిచేసిన జీ. వల్లీశ్వర్.. 'వైఎస్ఆర్ ఛాయలో' వల్లీశ్వర్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఎంపీ కేవీపీ రామచందర్ రావు, ఆంధ్రప్రదేశ్ అధికార బాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, ఎమెస్కో పబ్లిషర్స్ అధినేత ఎమెస్కో విజయకుమార్ లు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా వైఎస్ఆర్ స్మృతులను నెమరువేసుకున్నారు. ప్రజలతో డైరెక్ట్ గా కనెక్ట్ అయిన ముఖ్యమంత్రి వైఎస్ఆరె నని ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఆయన లాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో ఎవరు చూసి ఉండరని కొనియాడారు. దేవుడిస్థాయిలోకి రాజశేఖర్ రెడ్డి వెళ్లిపోయాడంటే ఆయన ఒక కారణజన్ముడేమోనని అనుకునేవాడినన్నారు. ఎమెస్కో విజయకుమార్ ప్రోత్సాహం తోనే తాను ఈ పుస్తకాన్ని రచించానన్నారు రచయిత వల్లీశ్వర్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories