వివేకా హత్య కేసులో ఇద్దరికి నార్కో అనాలసిస్‌ టెస్ట్ పూర్తి..

వివేకా హత్య కేసులో ఇద్దరికి నార్కో అనాలసిస్‌ టెస్ట్ పూర్తి..
x
Highlights

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇద్దరికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు పూర్తయ్యాయి. హత్య కేసులో నిందితులుగా ఉన్న వివేకా సన్నిహితుడు ఎర్ర...

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇద్దరికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు పూర్తయ్యాయి. హత్య కేసులో నిందితులుగా ఉన్న వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మన్‌ రంగయ్య, కసనూరు పరమేశ్వర్‌రెడ్డి, దిద్దెకుంట శేఖర్‌రెడ్డిలను నార్కో అనాలసిస్‌ పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ల్యాబ్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు పూర్తయినట్టు తెలుస్తోంది. శనివారం వాచ్‌మన్‌ రంగయ్యను, గంగిరెడ్డిని కడప పోలీసులు తిరిగి తీసుకొచ్చి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories