వివేకా హత్య కేసులో సీబీఐపై ఆరోపణలు చేసిన గంగాధర్‌రెడ్డి మృతి

*తనకు ప్రాణహాని ఉందని గతంలో జిల్లా ఎస్పీకి గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు

Rama Rao
Published on: 9 Jun 2022 11:04 AM IST
YS Viveka Murder Case One of The Witness Gangadhar Reddy Died
X

వివేకా హత్య కేసులో సీబీఐపై ఆరోపణలు చేసిన గంగాధర్‌రెడ్డి మృతి

Andhra Pradesh: మాజీమంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన గంగాధర్‌రెడ్డి మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని తన నివాసంలో గంగాధర్‌రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. అయితే తనకు ప్రాణహాని ఉందని గతంలో జిల్లా ఎస్పీకి గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు తనను బెదిరించి ఏకపక్షంగా సాక్ష్యం చెప్పమంటున్నారని గతంలో రెండుసార్లు ఎస్పీకి గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు సినట్టు సమాచారం. ఇప్పుడు గంగాధర్‌రెడ్డి మృతితో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను ఆరా తీస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story