నేడు వైసీపీ అగ్రనేతల పర్యటన వివరాలు..

నేడు వైసీపీ అగ్రనేతల పర్యటన వివరాలు..
x
Highlights

నేడు(ఆదివారం) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతల ప్రచార పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మూడు...

నేడు(ఆదివారం) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతల ప్రచార పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు నెల్లూరు జిల్లా గూడూరు, 11.30 గంటలకు ప్రకాశం జిల్లా గిద్దలూరు, మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శి, 3.30 గంటలకు కృష్ణా జిల్లా మైలవరంలో ప్రచార సభల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు.

అలాగే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో విజయమ్మ ప్రసంగించనున్నారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జగన్ సోదరి షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా గుంటూరు జిల్లా పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories