దూకుడు పెంచిన వైయస్ జగన్.. నేడు..

దూకుడు పెంచిన వైయస్ జగన్.. నేడు..
x
Highlights

ప్రచారం సమయం ముగుస్తుండటంతో వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఆదివారం తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో...

ప్రచారం సమయం ముగుస్తుండటంతో వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఆదివారం తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభల్లో ఆయన పాల్గొంటారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో, ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో, మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో, సాయంత్రం 4 గంటలకు విశాఖ జిల్లా గాజువాకలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ ప్రసంగిస్తారని పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories