ఆ 4 జిల్లాలపై స్పెషల్ ఫోకస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం

ఆ 4 జిల్లాలపై స్పెషల్ ఫోకస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం
x
Ys Jagan (File Photo)
Highlights

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆదివారం సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆదివారం సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన 32 వేల మందికి పరీక్షలు వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే కరోనా బీమా కిందకు గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

అలాగే కోవిడ్19 బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం అన్నారు. ఇక ప్రతి 2, 3 రోజులకోసారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని, ఆస్పత్రులు పరిశుభ్రంగా... ఉండేలా వ్యవస్థను తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను సీఎం పరిశీలించారు. వాటిని రెడ్‌ జోన్లకు ముందస్తుగా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు జగన్ కు వివరించారు. ఇక ప్రతి వ్యక్తికి మూడు చొప్పున మాస్కులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పది లక్షల మంది జనాభాకు అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానానికి చేరుకుంది.

కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని అధికారులు సీఎంకు చెప్పారు. ప్రతి పది లక్షల మంది జనాభాకు రాజస్థాన్ 685 పరీక్షలు చేస్తుండగా.., ఆంధ్రప్రదేశ్ 539 పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్‌ కిట్స్‌ ఉపయోగించకుండనే రెండో స్థానానికి చేరుకుందని అధికారులు తెలిపారు. రోజుకు 17వేల పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories