నేడు జగన్ ప్రచారానికి విరామం ఎందుకంటే..

నేడు జగన్ ప్రచారానికి విరామం ఎందుకంటే..
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు.ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ప్రకటన వెలువడించింది. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ...

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు.ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ప్రకటన వెలువడించింది. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో మంగళవారం ఎన్నికల నిర్వహణ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 2 వ తేదీన శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించడం లేదు. 3వ తేదీన మూడు జిల్లాల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో పర్యటిస్తారు. అనంతరం 11.30 గంటలకు గురజాలలో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కృష్ణా జిల్లాలోని మైలవరంలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories