చినజీయర్‌ స్వామీజీని కలిసిన వైఎస్‌ జగన్‌

చినజీయర్‌ స్వామీజీని కలిసిన వైఎస్‌ జగన్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం సాయంత్రం చినజీయర్‌ స్వామిజిని కలిశారు. ఈ సందర్బంగా ఆయన ఆశీర్వాదం...

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం సాయంత్రం చినజీయర్‌ స్వామిజిని కలిశారు. ఈ సందర్బంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న అనంతరం.. ఆయన నేరుగా ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. చినజీయర్‌ స్వామి దివ్య ఆశీస్సులు తీసుకుని, స్వామిజితో కాసేపు మాట్లాడారు. స్వామీజీని జగన్ కలవడం ఇది మూడోసారి.. గతంలో కూడా పాదయాత్రకు వెళ్లే ముందు చినజీయర్‌ స్వామిని వైఎస్‌ జగన్‌ కలిశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories