నేడు కీలక నియోజకవర్గాల్లో జగన్ పర్యటన.. భారీగా పోలీసు బందోబస్తు

నేడు కీలక నియోజకవర్గాల్లో జగన్ పర్యటన.. భారీగా పోలీసు బందోబస్తు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(శుక్రవారం) నాలుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం...

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(శుక్రవారం) నాలుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం, 11.30 గంటలకు కడప జిల్లా జమ్మలమడుగు, మధ్యాహ్నం 1.30 గంటలకు గుంటూరు పట్టణం, 3.30 గంటలకు విజయవాడలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. కాగా సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం, మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత నియోజకవర్గమైన కుప్పంలో జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories