నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌
x
Highlights

రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బృదం...

రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బృదం రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ను కలిసేందుకు వైసీపీ ప్రతినిధి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. పోలింగ్‌ ముగిశాక తమ పార్టీ వారిపై, తమకు ఓట్లేసిన సాధారణ ప్రజలపై టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తూన్నారు జగన్. దీనిపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలనా తీరుపై కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళతామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories