జగన్ ప్రచారం ముగింపు అక్కడే.. ఆ తరువాత..

జగన్ ప్రచారం ముగింపు అక్కడే.. ఆ తరువాత..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి మరికొద్ది గంటల్లో గడువు ముగుస్తుండగా.. చివరి రోజున వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటించి...

సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి మరికొద్ది గంటల్లో గడువు ముగుస్తుండగా.. చివరి రోజున వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి, 11.30 గంటలకు కర్నూలు, మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగే ప్రచార సభల్లో జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.

తిరుపతిలో జరిగే ప్రచార సభతో జగన్‌ తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మంగళవారం ప్రచారం చివరి రోజున కర్నూలు జిల్లాలోని డోన్, ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారని రఘురాం వెల్లడించారు.ఇక తిరుపతిలో ప్రచారం ముగిసిన అనంతరం జగన్ పులివెందులకు వెళ్లనున్నారు.జగన్ ప్రచారం ముగింపు అక్కడే.. ఆ తరువాత..

Show Full Article
Print Article
Next Story
More Stories